సికింద్రాబాద్ ప్యారడైజ్ నుండి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారింది. రక్షణ శాఖ భూముల బదిలీలో జాప్యం టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు.. రిజర్వాయర్లు, భవనాల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే ప్యారడైజ్ నుండి డెయిరీఫాం వరకు కారిడార్కు టెండర్లు పిలిచారు. త్వరలో తెరవనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణా సులభమవుతుంది. ఈ నెల 15న డెయిరీఫాం కారిడార్ టెండర్లు ఖరారు కానున్నాయి.