ప్రస్తుతం భూమి విలువ ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా.. పెట్టుబడి పెట్టాలన్నా, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనివల్ల ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రంగారెడ్డి జిల్లాలో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసిన స్థలంలో సమాధులు ఉండటంతో.. ఇక్కడ స్థలం అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని వాటిని రాత్రికి రాత్రే మాయం చేశారు.