అల్లూరి సీతారామరాజు జిల్లాలో భార్యాభర్తల గొడవలు తీవ్ర విషాదాన్ని నింపింది. జీకే వీధి మండలం చింతపల్లిలో బావ, బావమరుదుల మధ్య తలెత్తిన వివాదం ఇద్దరి హత్యకు దారితీసింది. గెన్ను అనే వ్యక్తి తన బావమరుదులైన కిముడు రాజు, కిముడు కృష్ణలను త్రిశూలంతో పొడిచి చంపాడు. మరోవైపు, విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో కోరాడ తాతారావు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.