ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు ఆగస్ట్ 15 నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో చెత్త కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.