ఏపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. అర్హులైన ఆటో డ్రైవర్లు అందరికీ రూ.15 వేల చొప్పున అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు.