అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 226 రోజుల తర్వాత బెయిల్ ద్వారా ఆయనకు ఊరట లభించినట్లు అయింది. ఆయనతో పాటు సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా హైకోర్టులో ఊరట దక్కింది. కాగా, విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి.. ఫిజియోథెరపి చేయించుకునేందుకు ఇటీవల ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.