అచ్చెన్నాయుడుకు జనసైనికుల షాక్..! సమావేశం నుంచి వెళ్లిపోయిన మంత్రి..

1 year ago 18
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు జనసైనికులు షాక్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు పాల్గొన్న సమావేశంలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో కూటమి పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు హాజరయ్యాయి. అయితే సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడంపై జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Read Entire Article