Chandrababu Consoles Atchutapuram Victims: అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడిన వారిని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయపడిన కొందరు కార్మికలకు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించారు.