డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా డిజి లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలను డిజి లక్ష్మిగా ఎంపిక చేసి.. ఉపాధి కల్పించనున్నారు. అలాగే వారి ద్వారా డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కియోస్క్ సెంటర్లు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.