నెల్లూరు జిల్లాలో కారులో నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిస పోలీసులు వారి నుంచి రూ.3.60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి.. రూ.4.5 కోట్ల నగదును గుమాస్తా, డ్రైవర్ చేతికి ఇచ్చి పంపించారు. అయితే మార్గమధ్యలో వారు నగదు తీసుకుని పరారయ్యారు. వ్యాపారవేత్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మర్రిపాడు పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. నిందితుల నుంచి రూ.3.60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.