దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న ఓ జవాన్ తన కుటుంబానికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్.. ఊరిలోని తమ భూమిని కబ్జా చేస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తనకు న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇంతకీ ఆ జవాన్ సమస్య ఏంటి? ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.