హైదరాబాద్లో మరోసారి నకిలీ నోట్లు కలకలం స్పష్టించాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వీటిని మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసులు వారిని అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒరిజినల్ కరెన్సీ రూ.లక్ష ఇస్తే.. వారికి రూ.4 లక్షల వరకు నకిలీ కరెన్సీలు ఇస్తామని ఆశ చూపెట్టి.. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.