తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తీరు, పలు వర్గాల నేతలపై మాట్లాడిన వ్యాఖ్యలపై హస్తం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సింపుల్గా.. అతని గురించి మాట్లాడే టైం లేదని.. మాట్లాడటం కూడా వేస్ట్ అంటూ కొట్టిపారేశారు.