వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్త మరణంతో శోకసంద్రంలో మునిగిన అల్లుడు శ్రీనివాస్.. ఆమెకు శ్రద్ధాంజలి ఫ్లెక్సీ చేయించి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఒకే రోజు అత్త, అల్లుడు మరణించడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.