ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న వేధింపులే కాకుండా.. కుటుంబ సమస్యలు, వేరు కాపురం డిమాండ్లు వంటి కారణాలతో భార్య, అత్తమామల వేధింపులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న భర్తల సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన కూడా అదే కోవలోకి వస్తుంది. భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తమామల వేధింపులు తాళలేక హరిప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భార్య, అత్తింటి వారిపై ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.