ఆనందోత్సవాల మధ్య దసరా వేడుకులు జరుపుకుంటున్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఇద్దరు పిల్లలను చంపేసి ఓ తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. అత్తింట్లో గౌరవం దక్కటంలేదని మానసిక వేధనకు గురై.. ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో చోటు చేసుకుంది.