ప్రస్తుతం మటన్ కంటే ఎక్కువ ధరతో చింతచిగురు అత్యంత ఖరీదైన ఆకుకూరల్లో ఒకటిగా మారింది. సీజనల్గా మాత్రమే లభించే ఈ కూర, తన ప్రత్యేకమైన రుచి, ఔషధ గుణాల వల్ల భారీ ధర పలుకుతోంది. ఖమ్మం రైతు బజార్లో కేజీ చింతచిగురు రూ.1000కి విక్రయించగా.. 100 గ్రాములు రూ.100 ధరకు అమ్ముతున్నారు.