Minister Mandipalli Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే విషయంలో దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి తాను ఒప్పుకున్నాననేది అవాస్తవమని, అలాంటిది జరిగితే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ తనపై దుష్ప్రచారం చేస్తోంది అన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిగానే కొనసాగుతుందని, కార్యాలయాల ఏర్పాటుకు స్థలాల కొరత ఉందని తెలిపారు.