ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్ పదవులు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయ సభలు శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ఈ ప్రభుత్వ విప్లను నియమించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, వేముల వీరేశం, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ రమణారావులకు కొత్త పదవులు వచ్చాయి.