హైదరాబాద్ నాచారంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. బంగారం కోసం అద్దెకున్న వ్యక్తి ఆమెను కిరాతకంగా చంపి, మృతదేహాన్ని వందల కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిలో పడేసినట్లు తేలింది. పక్కా ప్లాన్తో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి మృతదేహాన్ని కోనసీమ జిల్లాలో గుర్తించారు.