పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయింపులై కీలక కామెంట్స్ చేశారు. తనను కూడా పార్టీ మారాలని కొందరు సంప్రదించినట్లు చెప్పారు. అయితే తాను డబ్బులకు అమ్ముడుపోనని.. అందుకే వారి ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు.