అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మూడు రోజుల నుంచి కాకులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. యూనివర్సిటీకి సమీపంలోని వనమిత్ర అటవీ ఉద్యానం ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడ పెద్ద సంఖ్యలో పావురాలు చనిపోతున్నాయి. చెట్లపై ఉన్న కాకులు, పావురాలు ఉన్నట్లుండి కిందపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పక్షుల మృతికి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.