వేసవి కాలంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేలా అనంతపురంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద ఓపెన్ స్పేస్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సురేష్ నాయక్ అనే ఉపాధ్యాయుడు ఆలోచనతో దీనిని రూపొందించారు. ప్రయోగాత్మకంగా సప్తగిరి సర్కిల్ వద్ద ఏర్పాటు చేశారు. దీని ద్వారా వాహనదారులపై తుంపర్లుగా నీటిని చల్లుతారు. దీంతో ఎండవేడిమి నుంచి వారికి ఉపశమనం కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.