900 Car Engines Theft In Kia Factory: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం తాజాగా బయటపడింది. ముందు ఫిర్యాదు చేయకుండా దర్యాప్త చేయాలని పోలీసుల్ని కియా యాజమాన్యం కోరగా.. పోలీసులు నిరాకరించారు. దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. 900 ఇంజిన్లు మాయం కావం సంచలనంగా మారింది.