Anakapalle Disruption To Train Services: అనకాపల్లి జిల్లాలో విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్ను క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సెఫ్టీ గడ్డర్ ఢీకొనడంతో రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది. దీంతో, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు లోకోపైలట్ ఈ విషయాన్ని గమనించి రైలును ఆపేశారు. ఈ ఘటన కారణంగా విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ఎనిమిది రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.