రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టాప్ అండ్ వాష్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. రాత్రి వేళ జాతీయ రహదారులపై వెళ్తున్న వాహనాలను అపి, డ్రైవర్లతో ముఖం కడిగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత తిరిగి వాహనం నడిపేందుకు అనుమతి ఇస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అనకాపల్లి పోలీసులు భావిస్తున్నారు.