పోలవరం నుంచి గోదావరి నీళ్లు వస్తాయని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరబోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు అందబోతున్నాయి. తుని - నర్సీపట్నం రోడ్డు క్రాస్ చేస్తూ నిర్మించిన అక్విడెక్టు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. మొదటి దశలో 30 టీఎంసీల నీటిని అనకాపల్లి తరలిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్హౌస్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి ఈ నీటిని ఎత్తిపోస్తారు.