హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఫ్జల్ సాగర్, వినోబా నగర్ నాలాల్లో వరద ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయారు, వారిలో దినేష్ అనే వ్యక్తి ఆచూకీ కోసం అతని భార్య రాజశ్రీ కన్నీటితో ఎదురుచూస్తోంది. అనాథ అయిన రాజశ్రీ.. భర్త దూరమవడంతో మళ్లీ ఒంటరినయ్యానని రోధిస్తోంది.