అనుకున్నది 100 శాతం సాధించిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ..

6 months ago 10
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ వెల్లడించారు. కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ ట్రిప్లింగ్ ప్రాజెక్టులు త్వరలో ముగుస్తాయని తెలిపారు. ఇప్పటికే 78 స్టేషన్‌లలో సీసీటీవీలు అమర్చగా.. మరో 453కి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. అమృత్ భారత్ పథకంలో 119 స్టేషన్‌లు పునరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చాలని ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ రైల్వే అధికారులను కోరారు.
Read Entire Article