ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాయచోటిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పింఛన్ల పెంపు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.