Annadata Sukhibhava Scheme No E Kyc: ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభవ సాయం కోసం రైతుల ఈకేవైసీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తొలుత అందరూ చేయించుకోవాలని చెప్పినా, ప్రస్తుతం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని తెలిపింది. మిగిలిన రైతుల వివరాలు ప్రభుత్వ డేటాలో సరిపోలడంతో వారికి మినహాయింపు లభించింది. అర్హుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు, రైతులు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ నెల 20న డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.