Annadata Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఈకేవైసీ చేసుకోవాలని తొలుత చెప్పగా, రైతుల ఆందోళనతో నిబంధనలు సడలించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని 1.45 లక్షల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని తెలిపింది. అర్హత కలిగిన రైతులు ప్రభుత్వ వెబ్సైట్లో ఆధార్ నంబర్ ద్వారా తమ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది.