తెలంగాణలోని అన్నదాతకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు ఊపందుకోవడంతో వెయ్యికి పైగా కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. రానున్న రోజుల్లో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో మొత్తం ఎనిమిది వేల సెంటర్లను ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.