అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి

8 months ago 16
అన్నమయ్య జిల్లాలో ఒక విషాదం చోటు చేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న ఎనిమిది మంది కూలీలు చనిపోయారు. రైల్వే కోడూరు మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీలో 18 మంది కూలీలు ఉండగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article