దేశంలో మావోయిస్టులు అంతం అవుతున్న వేళ.. టాప్ లీడర్ గణపతి ఆచూకీ కనిపించడం లేదు. ఆయన అడవుల్లో లేరని.. విదేశాలకు పారిపోయారని వార్తలు వస్తున్న వేళ.. గణపతి సోదరుడు రామచంద్ర రావు స్పందించారు. అన్నయ్యా లొంగిపో అంటూ కీలక విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా మంది నక్సల్స్ లొంగిపోవడంతో.. ఉద్యమ ప్రభావం తగ్గిపోయిన నేపథ్యంలో.. పోలీసులకు లొంగిపోయి.. జనంలోకి రావాలని కోరారు.