అన్నా.. తప్పైపోయింది.. భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడిన కార్పొరేటర్లు..

2 months ago 5
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైన అనంతరం ఆసక్తికర ఘటన జరిగింది. ఎన్నిక సందర్భంగా టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చిన వైసీపీ కార్పొరేటర్లు నలుగురు.. ఆ తర్వాత వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పారు. ఎన్నిక తర్వాత భూమన ఇంటికి వెళ్లిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు.. కూటమి నేతలు తమను బెదిరించారంటూ ఆయన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. వైసీపీ కార్పొరేటర్లు అమర్నాథ్ రెడ్డి, అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్.. భూమనను కలిసి సారీ చెప్పారు. టీడీపీ వాళ్ళకి భయపడి ఓటు వేశామని.. తప్పు జరిగిపోయింది క్షమించమంటూ వేడుకున్నారు.
Read Entire Article