తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యమ ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు సమరానికి దిగడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారని, ఉద్యోగ సంఘాలు సహకరించి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. సమస్యలు ఉంటే చర్చించుకుందామని, ప్రభుత్వ ఉద్యోగులంతా కుటుంబ సభ్యులేనని రేవంత్ రెడ్డి తెలిపారు.