ఎండాకాలం పూర్తైంది. వానాకాలం వచ్చేసింది.. అయినా కూడా కొబ్బరి బొండాం రేట్లు తగ్గడం లేదు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఒక్కో కొబ్బరి కాయ ధర 50 నుంచి 60 రూపాయల వరకూ పలుకుతోంది. అలాగే లీటర్ కొబ్బరి నీళ్లు కూడా 150 వరకూ పలుకుతున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో కొబ్బరి నీళ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే వానాకాలంలోనూ కొబ్బరి ధర కొండెక్కడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.