ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 33 వేల ఎకరాలు సమీకరించగా , మరో 44 వేల ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో భూసమీకరణకు కసరత్తు జరుగుతోంది, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్నాయి.