Mangalagiri Cricket Stadium APL 2026 Matches: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ స్టేడియం ఉంది. మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఈ క్రికెట్ స్టేడియంలో చాలా రోజులుగా మ్యాచ్లు జరగడం లేదు. అయితే ఈ ఏడాది నుంచి మళ్లీ మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఏపీఎల్ మ్యాచ్లు ఇక్కడ నిర్వహిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అంతేకాదు ఏపీఎల్ మ్యాచ్లను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.