భద్రాచలం ఆలయంలో అభివృద్ధి పనుల కారణంగా భక్తుల దర్శన మార్గంలో కీలక మార్పులు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులను ఆలయం తూర్పు వైపు నుంచే అనుమతించనున్నారు. దర్శనం పూర్తి అయిన తర్వాత కూడా అదే మార్గం ద్వారా బయటకు రావాల్సి ఉంటుంది. పడమర వైపు మెట్ల తొలగింపు, ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఈ తాత్కాలిక మార్పు చేశారు.