ఒంగోలు పురపాలక సంఘం ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా... సెప్టెంబర్ నెలలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంత గొప్పదనాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ రాజాబాబు ఈ అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు జనార్దన్, విజయ్కుమార్లను సమన్వయం చేసుకుని వేడుకల నిర్వహణ ప్రణాళికను మరో మూడు రోజుల్లో విడుదల చేస్తామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కూడళ్లలో ప్రముఖుల విగ్రహాలు, ఫేమ్ వాల్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.