అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. అమరావతికి విరాళాలు అందించాలనుకునే వారికోసం సీఆర్డీఏ వెబ్ సైట్లో క్యూఆర్ కోడ్ను సైతం ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమరావతికి ఆన్లైన్ ద్వారా విరాళాలు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.