ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఒకే రాజధాని ఉంటుందని.. అభివృద్ధి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని ఉంటుందని.. అది కూడా అమరావతేనని తేల్చి చెప్పారు. రాజధాని ఒకటే ఉన్నా.. డెవలప్మెంట్ మాత్రం అన్ని జిల్లాల్లో ఉంటుందని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేర్చతామని తెలిపారు.