Narayana on Amaravati land pooling: అమరావతి రెండో దశ భూసమీకరణపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రెండో దశలో సుమారుగా 34 వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావించింది. 13 గ్రామాల పరిధిలో ఈ భూములను సమీకరించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం పలు గ్రామాలలో గ్రామసభలు కూడా నిర్వహించారు. అయితే అమరావతి రెండో దశ భూసమీకరణ ఆగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు.