Amaravati Farmers Assigned Tag Removed On Returnable Plots: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకి శుభవార్త చెప్పింది! రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇకపై అసైన్డ్ అనే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు అసైన్డ్ అనే పదం తీసేసి పట్టా భూమి అని పేర్కొనాలని ఆదేశించారు. దీనితో రైతులు తమ ప్లాట్లను అమ్ముకోవచ్చు. అయితే, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇంకా ఇబ్బంది పెడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి!