Amaravati Farmers Koulu Good News: అమరావతి రైతులకు పెండింగ్ ఉన్న డబ్బుల్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తం రూ.400 కోట్లు కేటాయించగా.. ఆ డబ్బులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి రైతులకు కొన్ని నెలలుగా కౌలు డబ్బులు చెల్లింపులు చేయలేదు. దీంతో అమరావతి రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ కౌలు డబ్బుల్ని క్లియర్ చేసింది. ప్రభుత్వం చెల్లింపులకు డబ్బులు విడుదల చేయడంపై అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.