AP Govt Withdraws Case On Amaravati Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులు, అంగన్వాడీ కార్యకర్తలకు ఊరటనిస్తూ గత ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులను కొట్టివేసింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై, వేతనాలు పెంచాలని ధర్నా చేసిన అంగన్వాడీ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో అమరావతి రైతులకు, అంగన్వాడీ కార్యకర్తలకు భారీ ఊరట దక్కింది.