అమరావతి వ్యాఖ్యల కేసులో అరెస్టైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గుంటూరు జిల్లా జైలు నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల అయ్యారు. ఇదే కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును విశాఖపట్నం వద్ద ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.