Amaravati Farmer 21 Acres Handed Over To CRDA: అమరావతి విస్తరణ కోసం రెండో దశ భూ సేకరణలో భాగంగా పల్నాడు జిల్లాకు చెందిన రైతులు తమ భూములను సీఆర్డీఏకు అప్పగించారు. వీధిపోటు, వాస్తు సమస్యలున్న ప్లాట్లను రద్దు చేసి, వేరే ప్లాట్లు కేటాయించే అధికారాన్ని సీఆర్డీఏ కమిషనర్కు కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి అదనపు సిబ్బంది కేటాయింపుతో పాటు, ఇతర వైద్య కళాశాలలకు పోస్టుల పునఃకేటాయింపునకు, గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం అభివృద్ధికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.